CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెసా చట్టానికి లోబడే పోడు పట్టాలు ఇవ్వాలి--:సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య.

Share it:

 



 గుండాల నవంబర్ 18 (మన్యం మనుగడ) పెసా చట్టానికి లోబడే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. గురువారం మండలం పరిధిలోని సాయన పల్లి గ్రామంలో సిపిఎం పార్టీ జనరల్ బాడీ సమావేశం దుర్గి రాంమూర్తి అధ్యక్షతన ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడే పట్టాలు ఇవ్వాలన్నారు. సర్వే నిర్వహించి ప్రతి కుటుంబానికి పది ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గుగులోతు ధర్మ , జిల్లా కమిటీ సభ్యులు నబి, మండల నాయకులు గోపి , గడ్డం కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: