మన్యం టీవీ ఏటూరు నాగారం
తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఏటూరునాగారం ఐటిడిఎ ఏపీ వో వినతి పత్రం అందజేశారు.
అనంతరం తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కబ్బాక శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ..
సాగులో ఉన్న ప్రతి ఆదివాసీ కుటుంబానికి హక్కు పత్రం ఇవ్వాలని,డిజిటల్ మ్యాప్ పద్దతి ని అనుసరించవద్దని కోరారు.ఎన్నో ఏళ్లుగా ఆదివాసీ లు అడవి ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తూ,పోడు వ్యవసాయం చేస్తున్నారని, వారికి న్యాయం చేయాలని కోరారు.5వ షెడ్యూల్ ప్రాంతాలలో 1/59 & 1/70 చట్టాలు అమలులో ఉన్నందున గిరిజనేతరుల కి భూ హక్కులు కల్పించడం చట్ట విరుద్ధమని అన్నారు.అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనేతరుల కి హక్కు పత్రాలు ఇవ్వొద్దని పేర్కొన్నారు.ఏజెన్సీ ప్రాంతాల లో ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.
Post A Comment: