మన్యం టీవీ చర్ల: చర్ల మండలం మామిడి గూడెం గ్రామానికి చెందిన చదువుల తల్లి కారం శ్రీలత కు స్పూర్తి ఫౌండేషన్ చైర్మన్, బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ చార్జ్ నానమాద్రి కృష్ణార్జునురావు ఫౌండేషన్ తరపున శాలువా కప్పి సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. కారం శ్రీలత ఇటీవలే విడుదలైన జెఇఇ అడ్వాన్స్ ఫలితాలలో 919 ర్యాంకు సాధించి బెనారస్ హిందూ యూనివర్శిటీ లో బిటెక్ లో సీటు సాదించింది. ఆదివాసీ నిరుపేద విద్యార్థిని అయిన శ్రీలత సాదించిన ఈ విజయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం పొంది.కెటీఆర్ దృష్టి ని కి చేరడంతో నగదు బహుమతి కూడా పొందడం విదితమే.పలువురు మానవతా వాదులు శ్రీలత ను కలిసి వివిద రూపాల్లో సహాయం చేయడానికి ముందు కు వస్తున్నారు.స్పూర్తి ఫౌండేషన్ పేరుతో గత మూడు దశాబ్దాలుగా పేద విద్యార్థులకు సహకారం అందిస్తున్న నానమాద్రి కృష్ణార్జునురావు చదువుల తల్లి ని సత్కారం అందించడమే కాకుండా వారణాసి వెల్లుటకు ప్రయాణ ఖర్చులను భరించాడనికి ముందు కొచ్చారు.శ్రీలత కుటుంబ సభ్యులు వారణాసి వెల్లి వచ్చేందుకు అయ్యే విమాన టిక్కెట్లు తను ఏర్పాటు చేస్తానని దాతృత్వం చాటుకున్నారు .ఈ కార్యక్రమం లో ఇర్పా కామరాజు, వీసం పల్లి నరసింహారావు, కంచెర్ల సింహాద్రి ,కొప్పుల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: