చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని మండల విద్యాధికారి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం నేషనల్ ఎచీవ్మెంట్ సర్వేలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పరీక్షలను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... జాతీయస్థాయిలో విద్యా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడం కోసం పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో విద్యావ్యవస్థలో తీసుకోవాల్సిన మార్పులను ఈ పరీక్షలను ఆధారంగా చేసుకొని అధ్యయనం చెయటం జరుగుతుందన్నారు. ఈ పరీక్షలను అబ్జర్వర్స్ డి మాధవి, హేమలత, రంగనాథ్, లక్ష్మీ సౌజన్య మరియు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Post A Comment: