మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామానుజవరం నుండి పగిడేరు పాతురు రోడ్డును వెంటనే పూర్తి చేయాలని సీపీఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కుంజా కృష్ణ కుమారి డిమాండ్ చేశారు.గొల్లకొత్తురు లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కుంజా కృష్ణ కుమారి మాట్లాడుతూ,గత సంవత్సర కాలం నుండి ఈరోడ్డు పనులు జరుగుతున్నాయని,కాని నేటికీ పూర్తి కాకపోవడం రాష్ట్ర ప్రభుత్వం కు గిరిజన,దళిత గ్రామాలంటే ఎంత చిన్న చూపు చూసున్నారో అర్థం అవుతుంది అన్నారు.ఈ రోడ్లు పై గర్భిణులు,వాహనదారులు ప్రయాణించాలంటే నరకం చూస్తున్నారని,పీతిరి వాగు పై వెంటనే చప్టా ను నిర్మించాలని డిమాండ్ చేశారు.సింగరేణి యాజమాన్యం తమకేమీ సంబంధం లేదు అన్నట్టు వ్యవహరిస్తోందని,కుంజా కృష్ణ కుమారి అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కొడిశాల రాములు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు వెంకన్న,ఉప్పుతల నర్సింహరావు,పిట్టల.నాగమణి,ముల్కల.ఉత్తమ్,వైనాల.నాగలక్ష్మి,రామగిరి రవీందర్, కమలమ్మ,సంకినేని వెంకట్రావు, కొమరం లక్ష్మీ,పులి.లక్ష్మీ నారాయణ,పులి కోమరయ్య , కుంజా జయమ్మ,కుంజా.ప్రసాద్ రావు,కుంజా.ఆదినారాయణ , కుంజా రమణమ్మ,కుంజా నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: