CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు భూముల పేరుతో ఇంటి పన్నులు వసూలు చేయడం సరికాదు : సిపిఎం

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు అటవీ హక్కుల చట్టం నిబంధనల మేరకు చట్టానికి లోబడి పోడు సాగుదరులకు పట్టాలు ఇవ్వాలని ఇంటి పన్నులు చెల్లిస్తేనే హక్కు పత్రాల దరఖాస్తులు ఇవ్వడం చట్టానికి విరుద్ధంగా ఉందని అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం నిబంధనలకు లోబడి పోడు సాగుదరులకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర నాయకులు ఏజె రమేష్ అన్నారు. సీపీఎం పార్టీ మండల కమిటీ సమావేశం ఎం లక్ష్మీ అధ్యక్షతన ఏలూరి భవన్ లో జరిగింది.ఈ సమావేశం ను ఉద్దేశించి వారు మాట్లాడుతూ..పోడు భూములకు పట్టాలు ఇచ్చే ఈ సందర్భంలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలని,అవినీతికి తావు లేకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. పిఆర్సి కమిటీ ల జోక్యంతో నే పట్టాలు ఇవ్వాలని అన్నారు.పోడు సాగుదారులు గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.అదేవిధంగా వరి బియ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వరి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని అన్నారు.బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలు రాజకీయ లబ్ది కోసం ఒకరి మీద ఒకరు బురద జల్లే కార్యక్రమాన్ని మానేసి రైతులు పండించే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి అబ్దుల్ నబి,సీనియర్ నాయకులు దేవులపల్లి యకయ్య,తాళ్లూరి కృష్ణ,వజ్జ సురేష్,మన్నెం మోహన్ రావు,కూకట్ల శంకర్,అలెటి సంధ్య,కాలంగి హరికృష్ణ,మాదరపు వెంకటేశ్వర్లు,వాసం రాము లు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: