గుండాల నవంబర్ 15 (మన్యం మనుగడ) ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలను మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయు లై తోటి విద్యార్థులకు బోధించారు. ప్రతి సంవత్సరం నెహ్రూ జయంతి నాడు బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. బోధించిన విద్యార్థులందరికీ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కిషన్, వెంకటేశ్వర్లు , భుజంగరావు, రామయ్య, లక్ష్మణ్ , జానీ, ఉమా, రాధిక, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
Post A Comment: