గుండాల నవంబర్ 15 (మన్యం మనుగడ) హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి వై వెంకన్న అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిత్యం అధిక బరువు మోసే కార్మికులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వారి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. చట్టబద్ధమైన హక్కులు లేకపోవడంతో వీరికి ఇబ్బందులు గురవుతున్నాయని అందుచేత ప్రభుత్వం వీరి సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అన్నారు. మండల అధ్యక్షుడిగా గడ్డం నగేష్ , కార్యదర్శిగా చేబోతున్న రవి, 15 మంది కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్య కిరణ్ , మంతిని నరేష్ , మొక్క నరేష్ , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: