మన్యం టీవి, అశ్వారావుపేట:
పురుగుల మందు తాగి బస్ ఎక్కిన ప్రేమ జంట
గమనించిన కండక్టర్.
హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓ ప్రేమజంట పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చండ్రుగొండ మండలం సీతాయిగుడేం గ్రామానికి చెందిన జగ్గారావు, అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక అశ్వారావుపేటలో పురుగులమందు సేవించి అశ్వారావుపేట బస్టాండ్ లో పాల్వంచ బుస్ లో కూర్చున్నారు. టికెట్లు ఇచ్చేందుకు వచ్చిన కండక్టర్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయాని గమనించి హుటాహుటిన బస్సును అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఇద్దరని పరిశీలించి మరణించినట్లు ధ్రువీకరించారు. జగ్గారావు ఆటోడ్రైవర్ కాగా , బాలిక తొమ్మిదో తరగతి చదువుతున్న ట్లు సమాచారం. చంద్రుగొండ పోలీస్ స్టేషన్లో గత రాత్రి వీరిద్దరిపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు ఇంటి పక్కన వారు కావడం గమనార్హం. రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.
Post A Comment: