. ఆరు స్థానాలకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బండా ప్రకాశ్, వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, కౌశిక్రెడ్డి, కడియం శ్రీహరి పేర్లను అధిష్ఠానం ప్రకటించింది. ఎన్నికలకు నేటితో నామినేషన్లు ముగియనుండగా అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. అభ్యర్థులంతా అసెంబ్లీకి చేరుకున్నారు. జాబితాలో చివరి నిమిషంలో బండా ప్రకాశ్, వెంకట్రామ్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి.* ఆరు స్థానాల్లో ఎన్నిక లాంఛనం కానుంది. ఈటల సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్కు మంత్రి పదవి దక్కనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అభ్యర్థుల ఎంపిక కోసం భారీ కసరత్తే జరిగింది. జాబితాలో ఆకుల లలిత కొనసాగింపుతో పాటు మధుసూధనాచారికి అవకాశం లభిస్తుందనే ఊహాగానాలు రాగా.. చివరి నిమిషంలో అంతా తారుమారైంది. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. సిద్దిపేట కలెక్టర్ గా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వెంకట్రామిరెడ్డిని పెద్దల సభకు పంపిచాలని తెరాస నిర్ణయించింది.
Post A Comment: