CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీట్ బెల్ట్ ప్రాధాన్యత అవగాహన వారోత్సవాలు ప్రారంభించిన పీకే ఓసి ప్రాజెక్ట్ మేనేజర్ మాలోత్ రాముడు

Share it:





మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి వ్యాప్తంగా నిర్వహించు వాహన చోదకుల,భారీ యంత్రాల ఆపరేటర్ల సీట్ బెల్ట్ ప్రాధాన్యత అవగాహన వారోత్సవాలను పీకే ఓసి ప్రాజెక్ట్ మేనేజర్ మాలోత్ రాముడు బుధవారం ఉదయం ఓసీ-2 ఆవరణలో లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రమాదాల బారిన పడకుండా కార్మికులకు వ్యక్తిగత రక్షణ పరికరాలు ఎంత అవసరమో,ప్రత్యేకించి వాహన చోదకులకు భారీ భూ చరిత యంత్రాల ఆపరేటర్లకు, క్రేన్ ఆపరేటర్ లకు,ప్రమాదాల నుండి సీట్ బెల్ట్ అంతగా కాపాడుతుందని అన్నారు. వెహికల్ డ్రైవింగ్ లో ప్రతి ఒక్క డ్రైవర్ తన రక్షణ తో పాటు తన వాహనంలో ప్రయాణిస్తున్న ఇతర కార్మికుల, అధికారుల ప్రాణాలను కాపాడే బాధ్యత కూడా అంతే ఉందని అన్నారు.కానీ ఎక్కువ మంది డ్రైవర్లు ఆపరేటర్లు సీట్ బెల్ట్ ప్రాధాన్యత తేలియక సీట్ బెల్ట్ ధరించడం అనేది అసౌకర్యంగా,కష్టంగా భావిస్తూ సీట్ బెల్ట్ ధరించడం పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని,రక్షణ విషయంలో ఇది సరైన మార్గం కాదని ఆయన అన్నారు.రక్షణ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేది లేదన్నారు.అనంతరం రమేష్ అనే డ్రైవర్ తో విధినిర్వహణలో వాహన చోదకులు పాటించాల్సిన రక్షణ సూత్రాల ఎస్ ఓ పి కాపీని చదివించారు.అనంతరం అందరితో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో పీకే ఓసి రక్షణాధికారి ఎం. లింగబాబు,ప్రైవేట్ కన్వినెన్స్ వెహికల్స్ ఇంచార్జ్ వరుణ్, సూపర్వైజర్ కార్తీక్,ఎస్ ఓ పి సమన్వయకర్త ఎస్డి.నాసర్ పా షా,బిక్షపతి,ప్రైవేటు వాహన డ్రైవర్లు కళ్యాణ్,బిక్షం, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: