గుండాల నవంబర్ 17 (మన్యం మనుగడ) మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో చేతన పౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు చతుర్విధ ప్రక్రియలు మరియు ఆంగ్ల భాష బోధన కు ఉపయోగపడే వర్క్ పుస్తకాలను ఫౌండేషన్ సభ్యులు ఉపాధ్యాయుడు సత్తు లాల్ అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురలు నారాయణమ్మ చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ పిల్లలకు ఉపయోగపడే విలువైన పుస్తకాలను అందించిన చేతన పౌండేషన్ మరియు సభ్యులైన సత్య లాల్ కు ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Post A Comment: