గుండాల /ఆళ్లపల్లి నవంబర్ 17 (మన్యం మనుగడ) రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం వేగవంతమైంది. మండలంలో ఉన్న అన్ని పంచాయతీల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సర్పంచులు వేగవంతం చేశారు. ఆళ్ల పల్లి పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కోటేశ్వరరావు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు
Post A Comment: