మన్యం టీవి, మణుగూరు:
మధ్యాహ్న భోజన కార్మికుల కు కనీస వేతనం రూ. 19,000/- ఇవ్వాలని సి ఐ టీ యూ జిల్లా నాయకులు బండి రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎం ఈ ఓ వీరస్వామి కి వినతిపత్రం అందజేశారు. అనంతరం బండి రాజేష్ మాట్లాడుతూ....
గత 20 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పధకాన్ని కార్మికులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు కాని కనీన వేతనాలు లేకుండా ఎలా జీవిస్తారని ప్రభుత్వాని ప్రశ్నించారు
గత 3 నెలలుగా బిల్లులు , వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు కూరగాయలు , నిత్యావసర సరుకుల ధరల మార్కెట్ బాగా పెరిగాయి వాటిని కొనలేని స్థితిలో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు
గుడ్లు ,గ్యాస్ , పప్పు , నూనె ఇతర సరుకులు ప్రభుత్వామే సరఫరా చేయాలని ,ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని , గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో విజయ , లలిత , రమణ , అరుణ , నాగరత్నం , కారం శాంత , సరస్వతి , సరిత , వెంకటలక్ష్మి , నర్సమ్మ , సోలం పద్మ , నాగమ్మ , కుంజా జయమ్మ , కుంజా సుధ , వెంకటరమణ ,సమ్మక్క , తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: