మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలోని చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాల ను ఐటిడిఏ పీఓ పోట్రు గౌతమ్ ఆకస్మిక తనికి చేశారు. తనిఖీలో భాగంగా లైబ్రరీ, గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్,కంప్యూటర్ ల్యాబ్ ని తనిఖీ చేసి తరగతి గదులలో విద్యార్థులతో విద్యను చదివించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాద్యాయులు సమయ పాలన పాటించాలని అన్నారు. గిరి దర్శని అభ్యాసికులకు కరెక్షన్ వేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డిడి రమాదేవి, ఏటిడిఓ పూనెం నరసింహరావు పాఠశాల ఉపాద్యాయులు ఉన్నారు.
Post A Comment: