గుండాల /ఆళ్ల పల్లి నవంబర్ 11 (మన్యం మనుగడ) మండలం పరిధిలోని జిన్నెల గూడెం పాఠశాలలో ఐ టి డి ఎ అందించిన సోలార్ దీపం లను ఎస్ఎంసి నాగేశ్వర్ రావు చేతులమీదుగా విద్యార్థులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గిరిజన ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దుస్తులతో పాటు ఇతర సామాగ్రిని అందజేస్తున్నారు. రాత్రి సమయంలో చదువుకునేందుకు కరెంట్ అంతరాయం ఉంటే సోలార్ దీపం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యయులు జోగ రాంబాబు, సి ఆర్ పి ప్రసాద్ రావు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: