మన్యం టివి, దుమ్ముగూడెం:
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించటం అంటే మరింత బాధ్యత పెరిగిందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని రాష్ట్రపతి అవార్డు గ్రహీత బెక్కంటి శ్రీనివాసరావు అన్నారు. బండారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాసరావు అధ్యక్షతన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇటీవల జిల్లా కలెక్టర్ నుండి అవార్డ్ అందుకున్న తాళ్లూరి వంశీమోహన్ మరియు వేంపాటి ఉషారాణిని ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఎన్.ఆర్ ఐ నిఖిత మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని అందులో అవార్డు సాధించటం మరింత ఆనందమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్ టి.యు దుమ్ముగూడెం అధ్యక్షులు నాగార్జున గ్రామస్థులు శ్రీనివాసరావు తో పాటు ఉపాధ్యాయులు ఏవీ సీతారాం,జీరవి, ఎం సరోజిని ఆయా తిరపతమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: