CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావటం బాధ్యత మరింత పెరిగింది ....

Share it:

 

     


      

మన్యం టివి, దుమ్ముగూడెం:

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించటం అంటే మరింత బాధ్యత పెరిగిందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని రాష్ట్రపతి అవార్డు గ్రహీత  బెక్కంటి  శ్రీనివాసరావు అన్నారు.   బండారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో  ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాసరావు అధ్యక్షతన ఉత్తమ ఉపాధ్యాయుల  సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇటీవల  జిల్లా కలెక్టర్ నుండి అవార్డ్ అందుకున్న  తాళ్లూరి   వంశీమోహన్ మరియు  వేంపాటి   ఉషారాణిని ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.   విశిష్ట అతిథిగా హాజరైన   ఎన్.ఆర్ ఐ నిఖిత మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని అందులో అవార్డు సాధించటం మరింత ఆనందమని అభిప్రాయం వ్యక్తం చేశారు.    ఈ కార్యక్రమంలో  పి.ఆర్ టి.యు   దుమ్ముగూడెం అధ్యక్షులు నాగార్జున గ్రామస్థులు శ్రీనివాసరావు తో పాటు ఉపాధ్యాయులు ఏవీ సీతారాం,జీరవి, ఎం సరోజిని ఆయా తిరపతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: