మన్యం వెబ్ డెస్క్:
భద్రాచలం అంబా సత్రం నందు అభినయ కూచిపూడి నాట్యాలయం వ్యవస్థాపకులు చల్ల కొండలరావు గారు మరియు వారాహి సంగీత అకాడమీ వ్యవస్థాపకులు వానిరామ్ గారి ఆధ్వర్యంలో రామనామ కీర్తనం కూచిపూడి నర్థనం కార్యక్రమం జరిగింది. ఉదయం 9గంటల నుండి రాత్రి 9గంటల వరకు 11గంటల పాటు నిర్వీరామంగా జరిగిన ఈ కార్యక్రమం భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించినది కార్యక్రమం అనంతరం చిన్నారులకు సర్టిఫికెట్ మరియు మెమొంటో అందచేశారు కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెరాస రాష్ట్ర నాయకులు తెల్లం వెంకట్రావు గారు,గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు మరియు కాంగ్రెస్ నాయకులు బోగాల శ్రీనివాస్ రెడ్ది గారు, ఐటీసీ కాంట్రాక్టర్, కళా పోషకులు పాకాల దుర్గా ప్రసాద్ గారు, ప్రభుత్వ పోలిటెక్నిక్ ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్ గారు భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోఆర్డినేటర్ ప్రసాద్ గారు, జె డి ఫౌండేషన్ సభ్యులు క డా లి నాగరాజు గారు విచ్చేసి చిన్నారులకు జ్ఞాపికలు అందజేయడం జరిగింది కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది.
Post A Comment: