మన్యం మనుగడ, గుండాల:
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం గుండాల ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణమ్మ మాట్లాడుతూ...నేటి బాలలే రేపటి పౌరులని తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉందని విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకెళ్లాలని తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరును తీసుకురావాలని విద్యార్థులను కోరారు .ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు స్వప్న, పద్మ, రామేశ్వరి ,వెంకటేశ్వర్లు పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Post A Comment: