- రైతాoగం కోసం ఏలాంటి యుద్దనికైనా సిద్ధమే
జెడ్పీ చైర్మన్ జగదీశ్
మన్యం టీవీ మంగపేట.
రైతుల పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లు గా అలుపెరగకుండా పనిచేస్తున్నట్లు,
రైతుల కోసం ఎలాంటి యుద్దానికైనా సoసిద్ధమని,రైతు కన్నీరు పెడితే దేశం బాగుపడదని ములుగుజిల్లా జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు.వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ రాష్ట్రపార్టీ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించగా,అందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.రాష్ట్ర రైతాంగానికి జరుగుతున్న అన్యాయాన్నిప్రశ్నించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బీజేపీ ప్రభుత్వం పైన రైతుల కోసం యుద్ధం ప్రకటించారన్నారు.
రైతుల పక్షాన టీఆర్ఎస్ రైతు ప్రభుత్వం పోరాడుతూనే ఉంటుందని,అవసరమైతే
రైతుల కోసం యుద్ధం చేద్దాం! అన్నారు
రైతు కన్నీరు పెడితే దేశం బాగు పడదన్నారు.
కడుపు నిండా అన్నం పెట్టే రైతు అన్న పైన రాజకీయాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వంమానుకోవాలన్నారు.పంజాబ్ రాష్ట్రంలో 90 శాతం ధాన్యం కొనుగోలు చేసిన రీతిగానే మన రాష్ట్రంలో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఆయన తో పాటు మంత్రులు, ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ,జిల్లా ప్రజాప్రతినిధులు రైతు మహా ధర్నాలోపాల్గొన్నారు.
Post A Comment: