మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం పినపాక నియోజకవర్గం గిరిజన సంక్షేమ హాస్టళ్ల లో పనిచేస్తున్న డైలీ వేజ్, ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్, పీ ఎం హెచ్ కార్మికులకు ఒక్కరికీ ఒక్కొరకమైన వేతనాలు ఇస్తున్నారు.మానపనికి సమాన వేతనం ఇవ్వాలని కలెక్టర్ జీ వో ప్రకారం వేతనాలు పెంచాలని,పెంచిన పీఆర్సీ నీ అమలు చేయాలని, పీ ఎఫ్, ఈ ఎస్ ఐ, ఇన్స్యూరెన్స్, వేతమం తో కూడిన లీవులు,ఇవ్వాలని,ఏజెన్సీ, టౌన్ లలో పనిచేస్తున్న కార్మికులకు సమాన వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ ప్రాంతీయ కన్వీనర్ అబ్దుల్ నబి డిమాండ్ చేశారు.ఇల్లందు, టేకులపల్లి, ఆళ్లపల్లి మండలాల పరిధిలో లోని సంక్షేమ హాస్టల్ కార్మికుల సమావేశం లక్ష్మయ్య,పద్మ అద్యక్షన జరిగింది.ఇందులో ఆలేటి కిరణ్,లక్ష్మీ,మంగ,కవిత,దన,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: