మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల పరిధిలోని బాంబే కాలనీలో నెలకొల్పిన తెలంగాణ మార్గదర్శి,ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ప్రొ.జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జాతి విద్రోహులపై కఠినచర్యలు తీసుకోవాలని మణుగూరు జడ్పీటీసీ పొశం.నర్సింహారావు డిమాండ్ చేశారు.ప్రో. జయశంకర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడాన్ని ఆయన ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేందుకు,తొలితరం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి,మలిదశకు మార్గదర్శిగా నిలిచారని అటువంటి మహా నేత విగ్రహాన్ని ధ్వంసం చేయడం సరికాదన్నారు.ఈ ప్రాంత నిధులు,నీళ్లు తెలంగాణ బిడ్డలకు దక్కాలని ఆఖరి శ్వాస వరకు అలుపెరగని పోరాటం చేసిన మహాయోధుడు జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి అవమానించడం దురదృష్టకరమన్నారు. జాతియోద్యమ నాయకులు, ఉద్యమకారుల విగ్రహాలపై దాడులకు తెగబడటం సరికాదని,నిందితులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించడం ద్వారా భవిష్యత్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ శాఖ అధికారులను కోరారు.ప్రో.జయశంకర్ విగ్రహం ధ్వంసం చేసిన ప్రాంతంలోనే తిరిగి విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీటీసీల ప్రధాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు వుకంటి ప్రభాకర్ రావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, నాయకులు మేకల రవి,మైనారిటీ సెల్ నాయకులు హాబీబ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: