CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఛలో-ఢిల్లీ పోస్టర్లను ఆవిష్కరించిన విప్ రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలకు 12% శాతం రిజర్వేషన్లు కల్పించాలని వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ,డిసెంబర్ 13, 14 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెండు రోజుల పాటు జరిగే నిరసన దీక్ష-మహా సభ కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుతూ,మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు,మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డా.పిడమర్తి.రవి నేతృత్వంలో ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను బుధవారం నాడు మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల. నాగేశ్వరరావు,భద్రాద్రి జిల్లా అధ్యక్షులు సిద్దెల.తిరుమల రావు,అసెంబ్లీ అధ్యక్షులు గంగారపు రమేష్,నియోజక వర్గ కో-కన్వీనర్.గోవింద శ్రీను,మండల అధ్యక్షుడు రావులపల్లి వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ పార్టీ యువజన నాయుకులు,రుద్ర వెంకట్, గుర్రం సృజన్,పొడుతూరి. విక్రమ్,బోయిళ్ళ.రాజు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: