మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు ఏఐసిసి పిలుపుమేరకు అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల దగ్గర నుండి వరి ధాన్యాన్ని ఆకాంక్షలు పెట్టకుండా కొనుగోలు చేయాలి అని తాసిల్దార్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె కేశవ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి పైన ఒకరు పెట్టుకోకుండా లాభనష్టాల బేరీజు వేసుకోకుండా రైతుల దగ్గర చివరి గింజ వరకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అతివృష్టి అనావృష్టి తో మరియు కల్తీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉంటే రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసే ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరంటే కాదు మీరు అంటూ నాటకాలాడుతున్నారని రైతులను ఏడిపించిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేదని అది గుర్తెరిగి రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఓరుగంటి బిక్షమయ్య ఎంపీటీసీ బేతం రామకృష్ణ సర్పంచ్ బట్ట సత్యనారాయణ కొండ బత్తుల ఉపేందర్ తూము వీర రాఘవులు కాక రాములు బచ్చు వెంకటరమణ బలిన మల్లేష్ గుర్రం చెన్నయ్య చంచల రాము మాది నేని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: