గుండాల నవంబర్ 24 (మన్యం మనుగడ) రాష్ట్రంలో పండుతున్న పంటలు అన్నిటికీ మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోడెం ముత్యమా చారి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ముత్యమా చారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం ఎక్కువగా పడుతున్నందున ఎటువంటి ఆంక్షలు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. వరి ధాన్యం వచ్చి నెల రోజులు అవుతున్న ఇప్పటివరకు ప్రభుత్వం 11 లక్షల క్వింటాలు కొనుగోలు చేసిందని అన్నారు రెండు వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉండగా 116 కు చెల్లించి ఉందని ఆయన అన్నారు. తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయన పల్లి ఎంపీటీసీ కల్తీ కృష్ణారావు, సర్పంచ్ ఈ సం సుధాకర్, కాంగ్రెస్ నాయకులు వాంకుడోత్ రమేష్ , ఈసం చల పతి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: