CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బ్యాంకు అధికారులు వేదిస్తున్నారంటూ.... ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో దమ్మపేట ఎస్బిఐ బ్యాంకు ఎదుట డ్వాక్రా మహిళలు బైఠాయింపు..

Share it:




 మన్యంటీవి, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని  పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు మంగళవారం  బ్యాంకు ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. మొత్తం  38 గ్రూపులకు చెందిన మొండి బకాయిలు వన్ టైం సెటిల్ మెంటు ద్వారా చెల్లింపులు చేసి  తమ బకాయిలను రద్దు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు 2018లో బ్యాంకు మేనేజర్ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి పెద్దల సమక్షంలో తెలిపారనీ అంగీకారాన్ని తెలిపిన  డ్వాక్రా మహిళలు  తమ మెడలోని నగలు, భూములను అమ్మి మొత్తం 78లక్షల రూపాయలు బ్యాంకుకు చెల్లించారనీ, బ్యాంకు అధికారులు పాస్ బుక్ లపై వెనుక పేజీలో వ్రాశారనీ, మరలా కొంతమందికి మరియు  అప్పు చెల్లించిన వారికి కూడా  మళ్ళీ బ్యాంకర్ల నుండి సమయం సందర్బం లేకుండా, అర్ధరాత్రి సమయంలో కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆవేధన వ్యక్తం చేసారు. భాధితులు చెల్లించిన మొత్తం  ఏమైందని, బ్యాంకు అధికారులు అమాయక  నాయకపోడు మహిళలను  అన్యాయం చేశారని ఆదివాసీ నాయకపోడు సేవ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు రావుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం బ్యాంకు ఎదుట బైఠాయించారు. దీనితో స్పందించిన బ్యాంకు సిబ్బంది  ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకు వెళ్ళి త్వరలో సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో  సమస్యను  సర్ధుబాటు చేశారు.. కార్యక్రమంలో వైస్ యంపిపీ దారా మల్లిఖార్జున రావు , జలగం వాసుబాబులు  సమస్య పరిష్కారం కోసం అధికారుల తో చర్చించినారు.

Share it:

TS

Post A Comment: