CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం నిరుపేదలకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూములకు పట్టాలు ఇవ్వాలి

Share it:


మన్యం టీవీ ఏటూరు నాగారం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ,బిసి,మైనార్టీలకు అడవి భూములు సాగుచేసుకుంటున్న ప్రతి ఒక్కరికి హక్కు పత్రాలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నెమలి నరసయ్య మాదిగ ఏడీఎస్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి శ్రీనివాస్ తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంపల శివ కుమార్,ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు వావిలాల స్వామి మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ములుగు జిల్లా  కన్నాయిగూడెం మండలంలోని భూపతి పురం,ములకలపల్లి షెడ్యూల్ కులాలు పోడు చేసుకొని సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్న భూములను పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులను విస్మరించిందని ప్రతిసారి దళితులను అనేక రకాలుగా మోసం చేస్తూనే ఉందని అన్నారు..ఎన్నో ఏండ్లుగా ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్ కులాలు పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నప్పటికీ వారికి హక్కులు కల్పించడంలో విఫలం చెందిందని అన్నారు. నిరుపేదలను గుర్తించి హక్కు పత్రాలు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల నాయకులు జాడి రాంబాబు,కావేరి సంతోష్, చందర్,శ్యాము,వేణు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: