●108 అంబులెన్స్లో ఓగర్భిణి పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన రమాదేవి(గర్భిణీ)బుధవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు వస్తుండటంతో కుటుంబసభ్యులు ‘108’అంబులెన్స్కు కాల్ చేశారు.కుటుంబసభ్యులు ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే అంబులెన్స్ అశ్వాపురం మండలానికి చేరుకుంది.అయితే ఈ క్రమంలో గర్భిణీని మల్లెలమడుగు గ్రామం నుంచి భద్రాచలం ప్రభుత్వఆసుపత్రికి తీసుకువెల్లుతుండగా ఇరవెండి-మల్లెలమడుగు మార్గమధ్యలో పురిటి నొప్పులు మరింత ఎక్కువ అవడంతో ‘108’అంబులెన్స్లోనే
పండంటి అమ్మాయికి జన్మనించింది.తల్లి-బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ప్రభుత్వఆసుపత్రికి తరలించామని‘108’ అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.ప్రజలు‘108’ సేవలను ఉపయోగించుకోవాలని సిబ్బంది కోరారు.ఈ
‘108’లో అంబులెన్స్ లో సిస్టర్ ఉదయకుమారి (టెక్కునిషన్)డ్రైవర్ నరసింహారావు ఉన్నారు.
Post A Comment: