మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం లోని రాజుపేట, రమణక్కపేట గ్రామాల్లో ఉన్న వ్యాపారస్తులు దుకాణాల సముదాయాల ముందు ప్రజా భద్రత, రక్షణ దృష్ట్యా ప్రతి ఒక్కరూ నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారస్తులకు మంగపేట ఎస్ ఐ తాహెర్ బాబా సూచించారు.గ్రామాల్లో నిఘా నేత్రా ల ఏర్పాటు వలన అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, గ్రామాల్లోకి ఆఘంతుకులు ప్రవేశించకుండా అనుక్షణం కాపాడేందుకు నిఘా నేత్రాల ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఏదైనాసంఘటన జరిగినపుడు నేర విచారణకూడా వేగ వంతంగా పూర్తవుతుందని రాజుపేట, రమణక్కపేట లోని వ్యాపారస్థులకు నిఘానేత్రాల పై మంగపేట పోలీస్ స్టేషన్ ఎస్ ఐ తాహెర్ బాబా అవగాహన కల్పించారు.
Post A Comment: