మన్యం టీవీ : జూలూరుపాడు, నవంబర్ 14, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రైతాంగ సమస్యలు పరిష్కరించకుండా ధర్నాల పేరుతో డ్రామాలాడుతున్న టిఆర్ఎస్, బిజెపి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని, సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో జరుగు ధర్నాను జయప్రదం చేయ్యాలని సిపిఐ జూలూరుపాడు మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతు పండించిన వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయ్యాలని, వరి మిర్చి, పత్తి పంటలకు నాణ్యమైన గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలను పరిష్కరించకుండా, ధర్నాల పేరుతో రైతాంగాన్ని మోసం చేస్తున్నారని, వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వైరా మాజీ నియోజకవర్గ కార్యదర్శి చండ్ర నరేంద్ర కుమార్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింత స్వరాజ్యరావు, సిపిఐ నాయకులు ఎల్లంకి మధు, కొండ వీరయ్య, బడుగు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. .
Post A Comment: