బంగారు బ్రాస్ లెట్,రెండు బంగారు ఉంగరాలు,మూడు జతల వెండి,కాళ్ళ పట్టీలు మరియు పదివేల రూపాయలు,ఒక సెల్ ఫోన్ రికవరి
మన్యం టీవి,
భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి, సంఘం నాగరాజు
ఇళ్ళల్లో ఎవరు లేని సమయంలో దోపిడీకి పాల్పడి న దొంగను చాకచక్యంగా అరెస్ట్ చేసి, సొత్తు ను రికవరీ చేశారు లక్ష్మీ దేవి పెల్లి పోలీసులు. లక్ష్మీదేవి పల్లి ఎస్ ఐ కే. అంజయ్య విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
గత నెల 26న మధ్యాహ్నం 12 గంటలకు లోతువాగుకు చెందిన కట్ట రవికుమార్ అనే అతను తన ఇంటికి తాళం వేసి తన బంధువుల ఇంటికి వెళ్లి సుమారు మధ్యాహ్నం మూడున్నర గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న ఒక చేతి బంగారు బ్రాస్ లెట్,రెండు బంగారు ఉంగరాలు,మూడు జతల వెండి,కాళ్ళ పట్టీలు,రూ.10 వేలు ,ఒక సెల్ ఫోన్ దొంగిలించడం జరిగిందని గుర్తించి అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.
గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇల్లందు క్రాస్ రోడ్ నందు టేకులపల్లికి చెందిన తేజావత్ అనిల్ అనే వ్యక్తి పోలీసు వారిని చూసి భయపడి పారిపోతుండగా పట్టుకుని విచారించగా లోతువాగులోని కట్టా రవికుమార్ ఇంటిలో దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు ఎస్ఐ తెలిపారు. అనిల్ ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి చోరికి గురైన సొత్తు రికవరీ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరిగిందని ఎస్ ఐ తెలిపారు. చాకచక్యంగా చోరీ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్సై ఈ సందర్భంగా అభినందించారు.
Post A Comment: