గుండాల నవంబర్ 11( మన్యం మనుగడ) మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సమితి( పిఎసిఎస్) కొనుగోలు కేంద్రాన్ని జెడ్ పి టి సి రామక్క, ఎంపీపీ ముక్తి సత్యం, తో కలిసి చైర్మన్ రామయ్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. రైతుల వద్ద ఉన్న ప్రతీ గింజను కొనుగోలు చేస్తామన్నారు. పూర్తిగా ఆరిన తరవాతే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. ఏ గ్రేడ్ కు 1960, సాధారణ రకము కు 1940 , గా ధర నిర్ణయించారు అన్నారు. 17 లోపు తేమశాతం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంధాని, వైస్ చైర్మన్ శాంతా తదితరులు పాల్గొన్నారు
Post A Comment: