మన్యం టీవీ ఏటూరు నాగారం
నూతన వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించిందని,ఇది అన్నదాతలు సాధించిన విజయంగా ములుగు జడ్పీ చైర్మన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుసుమ జగదీష్,అభివర్ణించారు.ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు చేసిన సుధీర్ఘ పోరాటానికి కేంద్ర దిగిరాక,తప్పలేదన్నారు.రైతులకు మద్ధతుగా...వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు ధర్నా ఉద్యమ సెగ ఢిల్లీకి తగిలిందని తెలిపారు.సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని,వారి కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై నిర్విరామంగా పోరాటం చేసి విజయం సాధించిన అన్నదాతలకు వారి కోసం అండగా నిలిచిన ములుగు టిఆర్ఎస్ కార్యకర్తలకు ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అభినందనలు తెలిపారు.
Post A Comment: