మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని 100 పడకల హస్పిటల్ నుండి మద్దులగూడెం వరకు 1.2 కిలోమీటర్ల వరకు కొత్త రోడ్డు మరియు సైడ్ కాలవలు నిర్మించాలని శుక్రవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.అనంతరం సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ,100 పడకల హస్పిటల్ నుండి మద్దులగూడెం వరకు గల రోడ్డు మెత్తం పాడైపోయిందని గుంతలు పడి,సైడ్ కాలవలు లేకపోవడంతో వర్షకాలంలో నీరు మెత్తం రోడ్డు మీద, మోకాళ్ళ కిందకి నీరు నీల్వ ఉంటున్నాయి అని,వాటి వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అని,ఎన్నో సార్లు ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రం అందజేశారు.కాని ఇప్పటి వరకు సమస్యలు పరిష్కరించబడలేదు అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, జడ్పీటీసీ స్పందించి,వర్ష కాలం వచ్చేలోపు వెంటనే నూతన రోడ్డు,సైడ్ కాలువలు నిర్మించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రోడ్డు,సైడ్ కాలవల కోసం పోరాటం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కొడిశాల రాములు, బండి రాజేష్,టివిఎంవీ ప్రసాదరావు,వెంకన్న, ఉప్పుతల నర్సింహరావు, ముల్కల ఉత్తమ్,వైనాల. నాగలక్ష్మి,పప్పుల.అనసూయ,కృష్ణ,శ్రీను,దొడ్డి వంశీ,నర్సయ్య, రోజు బాబు,పుట్టా.సత్యవతి, అరుణ,రోండ్ల లక్ష్మీ,రోండ నర్సింహరావు,లక్ష్మీ,వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: