మన్యం టీవీ మంగపేట: మంగపేట మండలంలో ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి జీ.పనని ఆకస్మిక పర్యటన చేశారు.మండలంలోని కమలాపురం హైస్కూల్ మరియు మంగపేట హై స్కూల్,మండల విద్యా వనరుల కేంద్రం తో పాటు కేవీబీవీ ను జిల్లా విద్యాశాఖ అధికారి జీ.పనని అకస్మాత్తుగా తనిఖీ చేసి విద్యా శాఖలో అమలవుతున్న విద్యా సంభందిత కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులను ఉద్దేశించి అందరు లెసన్స్ ప్లాన్స్ ,డైరీ రోజు రాసి విద్యార్థులకు విద్యా భోధన చేయాలని, నేషనల్ ఆచివ్ మెంట్ సర్వే ఈ నెల 12 వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల హాజరు వంద శాతం ఉండాలని, విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందివ్వాలని , అక్టోబర్ నెలలో 14 రోజుల కన్న ఎక్కువ ఆబ్సెంట్ గా ఉన్న విద్యార్థుల వివరాలు వెంటనే తెలియజేయాలని, ఎస్సి విద్యార్థులకు స్కాలర్షిప్ కోసం ఆన్లైన్ లో అందరూ ప్రధానోపాధ్యాయులు అప్లై చేపించాలని,ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని సూచించారు.అలాగే ములుగు వెలుగు యాప్ ద్వారా హాజరు సకాలంలో వేయాలని కోరారు.
Navigation
Post A Comment: