గుండాల/ ఆళ్ల పల్లి నవంబర్ 17 (మన్యం మనుగడ) పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో రేగా ట్రస్ట్ ద్వారా నియోజకవర్గ గిరిజనులు పేదవారికి ఉచిత కంటి ఆపరేషన్స్ కార్యక్రమం నిర్వహించబడుతుంది అని గుండాల ఆళ్లపల్లి మండలాల్లో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఆదాం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సారథ్యంలో అభివృద్ధి జరుగుతుందని రేగా కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏదేమైనా 2023 ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీ రేగా కాంతారావు అఖండ మెజార్టీతో గెలుపొందు తారని ఆయన అన్నారు
Post A Comment: