మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం మణుగూరు నందు సంఘం అధ్యక్షులు కుర్రి.నాగేశ్వర రావు అధ్యక్షతన 68 వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా మణుగూరు సంఘము నందు మణుగూరు మండల రైతులకు మరియు సంఘ సభ్యులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయటం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మణుగూరు జడ్పిటిసి కోసం నరసింహారావు ఎంపీపీ కారం విజయ్ కుమారి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ పొశం.నర్సింహారావు మాట్లాడుతూ,రైతులు అందరు కూడా సంఘములో వచ్చే అన్ని రాయితీ విత్తనములు, ఎరువులు ని సద్వినియోగం చేసుకోవాలని,అలానే అందరు ఋణ గ్రహీతలు సకాలములో వడ్డీ చెల్లించి,మరల తిరిగి రుణములను పొందాలని అన్నారు.మణుగూరు సహకార సంఘంను ఒక గొప్ప సహకార సంఘముగా తీర్చిదిద్దాలని, సంఘ స్టాఫ్ ని కోరుతూ,అలాగే వారికి రైతులు కూడా సకాలములో వడ్డీలు చెల్లిస్తూ, రైతులు కూడా సహకారాన్ని అందించాలని తెలిపారు. సంఘములో జరిగే అన్ని కార్యక్రమాలకు రైతులు హాజరు అయ్యి,అట్టి కార్యక్రమమును విజయవంతం చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో మణుగూరు ఎంపీపీ కారం.విజయ కుమారి, పినపాక సంఘ అధ్యక్షులు ఎం.వి.ఎస్.ఆర్.ఎస్.వర్మ,అగ్రికల్చర్ ఎ డి ఏ తాతారావు,వైస్ ఎం.పి.పి. కే.వి.రావు, సమితిసింగారం సర్పంచ్ బచ్చల భారతి,ఉపసర్పంచ్ పుచ్చకాయల శంకర్, మణుగూరు వ్యవసాయ అధికారి రామశివరావు, డి.సి.సి.బ్యాంకు మేనేజర్ సీతారామయ్య,కోపరేటివ్ డిపార్ట్మెంట్ సీనియర్ ఇన్స్పెక్టర్,ఆడిటర్ కే.రమేష్, సంఘ ఉపాధ్యక్షులు దొండేటి రామ్మోహన్ రావు,సంఘ డైరెక్టర్లు,సంఘ సి.ఇ.ఒ. టి.జ్ఞానదాస్,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు, యువజన నాయకులు,సంఘ స్టాఫ్ ఎం.డి.తాజుద్దీన్, జి.రాఘవులు మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: