CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వగ్గెల పూజ సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరిక

Share it:

 *మన్యంటీవి, అశ్వారావుపేట:* అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జుజ్జురి దుర్గారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో 1వార్డ్ మెంబెర్ మరియు పలు కుటుంబాలు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్బంగా వార్డ్ మెంబెర్ యార్లగడ్డ జగదాంబ మాట్లాడుతూ పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు రావాలన్న, పేద ప్రజలకు పోడు భూమలకు పట్టాలు రావాలన్న ఒక్క కాంగ్రెస్ తోనే సాద్యం అని అన్నారు. కాంగ్రెస్ హైయామ్ లోనే పేదలకు బడుగు బలహీన వర్గాల కి నాయ్యం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా హాజరు అయిన వగ్గేల పూజ  మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ హైయామ్ లో మిత్రసేన ఎంఎల్ఏ గా వున్న సందర్బం లోనే అభివృద్ధి జరిగిందని. ప్రతి పేద వాడికి ఇళ్లు ఇవ్వటం జరిగిందని అన్నారు. గత తెరాస 7 ఏళ్ళ లో పోడు దారులని అనేక ఇబ్బందులకి గురి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు కొప్పుల శ్రీను, మామిళ్ళ వారి గూడెం ఎంపీటీసీ అనసూయ, కనకం, ఉప్పల రాజశేఖర్, వగ్గేల లక్ష్మణరావు, కొనకళ్ళ లక్ష్మణరావు, 2వార్డ్ మెంబెర్ తలగాని సుజాత,జుజ్జురి వెంకటనారాయణ, చేవల మహేష్, జుజ్జురి పోతురాజు తదితరులు పాల్గొన్నారు.
Share it:

TS

Post A Comment: