మన్యం మనుగడ/ప్రతినిధి:ములకలపల్లి:(నవంబర్1)తిమ్మంపేట ప్రాథమికోన్నత పాఠశాల లో చదువుతున్న విద్యార్థులకు పాల్వంచ వర్తక సంఘం కన్వీనర్ చలువది ప్రకాష్ ద్వారా విద్యార్థుల కు అవసరమైన నోట్ పుస్తకాలు పెన్నులు,కాపీ రైటింగ్ పుస్తకాలు(తెలుగు,ఇంగ్లీషు,హిందీ) మరియు పూర్ణ మెడికల్ స్టోర్ వారు మస్కులు,శానిటైజ్ బాటిల్స్ అందించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ మాట్లాడుతూ విద్యార్థుల అవసరార్ధం కొరకు చేసిన విన్నపానికి వెంటనే స్పందించి వితరణ చేయడం జరిగింది. ఉపయోగకరమైన ఈ సహాయానికి ముందుకు వచ్చిన పాల్వంచ వర్తక సంఘం కన్వీనర్ చలువది ప్రకాష్,పూర్ణ మెడికల్ స్టోర్ వారికి,ఆర్య వైశ్య సంఘం నాయకులు శ్రీను,వాసవి క్లబ్ నాయకులు సతీష్ లకు పాఠశాల ఉపాధ్యాయ బృందం,పాఠశాల కమీటీ,గ్రామ సర్పంచ్ గౌరి లక్ష్మి, గ్రామ పెద్దలు తాండ్ర అరుణప్రభాకర్ మరియు విద్యార్థులు గ్రామస్తులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Navigation
Post A Comment: