👉 కేసీఆర్,మోడీ పరిపాలనను బొంద పెట్టే రోజు దగ్గరలోనే ఉంది
👉 ధమ్మపేట మండల కౌన్సిల్ సమావేశంలో దుయ్య బట్టిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.
మాన్యం మనుగడ/ప్రతినిధి:ధమ్మపేట:(నవంబర్2): తెలంగాణ రాష్ట్రంలో, మరియు దేశంలో నియంత్రణ పాలన నడుస్తుందని పరిపాలనలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేసి ఇప్పుడు ప్రజల నెత్తిన పిడి గుద్దులు గుద్దు తున్నారని, ప్రభుత్వ సంస్థలను పెట్టుబడిదారుల చేతుల్లో పెడుతున్నారని,పెట్రోలు,డీజిల్ రేట్లు పెంచుతు ఈ దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టు వేస్తున్నారని,రాష్ట్రంలో కెసిఆర్ పాలన చాలా అధ్వానంగా ఉందని,దళిత బంధు పేరుమీద దళితులను మరోసారి మోసం చేస్తున్నారని,పోడు భూముల పేరుమీద గిరిజనులను మోసం చేస్తున్నారని,డబల్ బెడ్రూమ్ ఇల్లు అని నిరుపేదలను మోసం చేస్తున్నారని,ఈ ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని,సిపిఐ పార్టీ నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నరాటి ప్రసాద్ జిల్లా నాయకులు యార్లగడ్డభాస్కర్ రావు,మండల కార్యదర్శి తంగేళ్లమూడి శివకృష్ణ,పండూరి వీరబాబు,యండమూరి రత్నకుమారి, బత్తుల సాయి, కుక్కలగుంట సత్యనారాయణ,నల్ల ప్రసాద్,జాన్ బి, శాంతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: