మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో నీ రాళ్ల కుంట చెరువు మత్తడి ని కబ్జా చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు వెంటనే తొలగించాలని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడెం బాబు,రాష్ట్ర కార్యదర్శి కోర్ని బెల్లి వీరేశం,రాష్ట్ర కోశాధికారి చంద రఘుపతి రావు డిమాండ్ చేశారు.ఏటూరు నాగారం లోని క్రాస్ రోడ్ లో స్థిరపడిన సంబంధిత ఉద్యోగ తనకు బినామీ మరొకరిని ఏర్పాటు చేసుకొని చెరువు మత్తడి భూమిని కబ్జా చేసాడని తెలిపారు.అధికారులు రెవెన్యూ అధికారులు ఇంత జరుగుతున్నా స్పందించడం లేదన్నారు.చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. చెరువు మత్తడి ని ఆక్రమించి సుమారు ఎనిమిది గంటల ఆ స్థలంలో ప్రహరి నిర్మిస్తుండగా స్థానిక తాసిల్దార్ కె.రవీందర్, ఆర్ ఐ శారద,విఆర్వోలు పాండయ్య,రాములు ఇతర సిబ్బందితో వెళ్లి నిలిపివేశారు.
Post A Comment: