మన్యం టీవీ చర్ల:కోయగూడెం నుండి వారణాసిలో ఐఐటీ ఇనిస్టిట్యూట్ కి సెలెక్ట్ అయిన నిరుపేద గిరిజన విద్యార్థి కారం శ్రీలతను అభినందించిన ఏజెన్సీ అభివృద్ధి ప్రధాత ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మల్సి బాలసాని లక్ష్మీనారాయణ. హైదరాబాద్లో రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మాత్యులు తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కలిసిన కారం శ్రీలతను ఈరోజు సరిఅయిన రహదారి కూడా లేని మారుమూల గిరిజన గూడెంలోని శ్రీలత స్వగృహంలోకి వెళ్లి వారిని కుటుంబ సభ్యులను కలిసి వారికి అభినందనలు తెలిపారు. శ్రీలత మరింత మందికి ఆదర్శంగా నిలిచింది అని ఇదే స్పూర్తితో మరికొంత మంది శ్రీలతలు ఉన్నత శిఖరాలకు ఎదిగి ఈ ప్రాంత పేరును నలుదిశాలు వ్యాప్తి చేయాలి అని కొనియాడారు.అలాగే వారి ప్రయణంకు కావలసిన ఖర్చులను తానే స్వయంగా భరిస్తాను అని తెలిపారు. తక్షణ సహాయంగా పార్టీ తరపున 7000 రూపాయల నగదును అందచేసారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ భద్రాచలం ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చయ్య, చర్ల మండల టిఆర్ఎస్ అధ్యక్షులు సోయం రాజారావు కార్యదర్శి నక్కబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: