గ్రామకంఠం భూమి గ్రామస్థులకే చెందాలి
- బృహత్ పల్లె ప్రకృతి వనం కు వేరే స్థలం కేటాయించండి
- తహశీల్దార్ కు వినతిపత్రం అందజేసిన బుచ్చంపేట గ్రామస్తులు
మన్యం టీవీ మంగపేట.
మండలంలోని బుచ్చంపేట గ్రామానికి సంబంధించిన గ్రామకంఠం భూమిలో బృహత్ పల్లె ప్రకృతి వనం పెట్టొద్దని, పల్లె ప్రకృతి వనానికి వేరే స్థలంలో భూమి కేటాయించాలని బుచ్చంపేట గ్రామస్తులు సుమారు రెండు వందల యాభై మంది గ్రామస్తులు మంగళవారం మండల తహశీల్దార్ బాబ్జి ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో బస్టాండు మరియు రామాలయం, ఆంజనేయస్వామి దేవాలయాలు మరియు గ్రామంలో చాలిచాలని ఇళ్లలో ఉంటున్న నిరుపేదల కోసం ఇంటి స్థలాలు గా కేటాయించాలని గ్రామస్తులు వేడుకున్నారు. గత 70 సంవత్సరాల నుండి ఈ స్థలాన్ని ఎవరు ఆక్రమించకుండా దేవాలయాలు, బస్టాండు నిర్మాణం, నిరుపేదలకు ఇంటి స్థలాల కోసం కాపాడుకుంటున్నామని అన్నారు. ఇట్టి విషయంలో ప్రభుత్వ అధికారులు స్పందించి అట్టి భూమిని బస్టాండు నిర్మాణం, దేవాలయం మరియు ఇల్లు లేని నిరుపేదలకు కేటాయించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చంపేట గ్రామస్తులు రెండు వందల యాభై మంది పాల్గొన్నారు.
Post A Comment: