మన్యం మనుగడ వాజేడు. ఈరోజు గ్రామపంచాయతీ మురుమురు సబ్ సెంటర్ పగల్ల పల్లిలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సమావేశంలో మాతా శిశు సంరక్షణ వైద్యాధికారి కొమరం. మహేందర్, మాట్లాడుతూ అయోడైజ్డ్ ఉప్పు సాల్ట్ మాత్రమే ఉపయోగించాలి తద్వారా అయోడిన్ లోపం వలన వచ్చే వ్యాధులను నివారించవచ్చని అవగాహన కల్పించారు. అంతేకాక అయోడిన్ టెస్ట్ ఇన్ కిట్స్ ను ఏఎన్ఎం. మరియు ఆశలకు, అందజేసి ఉప్పులో అయోడిన్ స్థాయిని తెలుసుకునే విధంగా శిక్షణ ఇవ్వడం జరిగినది,30 సంవత్సరాల పైబడిన వారందరినీ అధిక రక్తపోటు మరియు మధుమేహం మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయవలసిందిగా ఏఎన్ఎం మరియు ఆశ వర్కర్లకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్య శిబిరంలో సూపర్వైజర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగినది. ప్రతిరోజు వెల్నెస్ యాక్టివిటీస్ ని ఆయుష్మాన్ భారత్ వెల్నెస్ సెంటర్ పోర్టల్ లో అప్లోడ్ చేయవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ మంచి వెంకటేశ్వర్లు సిహెచ్ ఓ సూర్యప్రకాశరావు వైద్య సిబ్బంది కోటిరెడ్డి కన్యాకుమారి ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: