మన్యం టివి ,దుమ్ముగూడెం::
ఏజెన్సీ లోని నిరుద్యోగ యువతి,యువకులకు పోలీస్ శాఖ భరోసా కల్పిస్తుందని భద్రాచలం ఏఎస్పి వినిత్ జి అన్నారు. శిక్షణ తరగతుల ముగింపు రోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న 14 మంది యువకులకు శిక్షణ ఇవ్వడం జరిగింది.భద్రాద్రి ఎస్ పి సునీల్ దత్ ఆదేశాల మేరకు దుమ్ముగూడెం సి ఐ వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 14 మంది యువకులకు నెల రోజుల పాటు వసతి,భోజన వసతి, స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ శిక్షణ లో పరీక్షల నిర్వహణ పై అవగాహన, ప్రతి రోజు గ్రౌండ్ లో ఫిజికల్ ట్రైనింగ్ చేయించారు. యువకులకు శిక్షణ ఇవ్వడం కోసం కృషి చేసిన సి ఐ, ఎస్ ఐ, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు, అలాగే యువకులకు తరగతులు నిర్వహించిన యం ఈ ఓ సున్నం సమ్మయ్య,ఉపాధ్యాయులను అభినందించారు.
Post A Comment: