- మణుగూరు టౌన్ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జిగా మారోజు రమేష్.
- శ్రమ,విధేయతకు గుర్తింపు
- బీసీ సంఘం నాయకులు హర్షం
- విప్ రేగా కాంతారావు కు రుణపడి ఉంటా:మారోజు రమేష్
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణ టీఆరెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా మారోజు రమేష్ నియామితులయ్యారు.ఈ మేరకు ఆయన సోమవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి కట్టబెట్టిన విప్ రేగా కాంతారావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రమ,విధేయతకు ఎప్పటికీ గుర్తింపు లభిస్తుందని మారోజు నియామకం పట్ల టిఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.మారోజు రమేష్ ను టిఆర్ఎస్ పార్టీ మణుగూరు టౌన్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించడం పట్ల బీసీ సంఘం నాయకులు,పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, మణుగూరు పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,మండల అధ్యక్షులు ముత్యంబాబు, భుర్గంపాడు మండల అధ్యక్షులు గోపిరెడ్డి. రమణారెడ్డి,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,సీనియర్ నాయకులు వట్టం.రాంబాబు, ముద్దంగుల.కృష్ణ,ప్రభుదాస్,యువజన అధ్యక్షులు రుద్రవెంకట్,కార్యదర్శి గుర్రం. సృజన్,సోషల్ మీడియా అధ్యక్షులు సురేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: