CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ నాయకులు వనమా గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన పండిత్ జవాహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు.

Share it:




మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి(నవంబర్-14):: మన దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్య ఉద్యమ పోరాట నాయకుడు పండిత్ జవాహర్‌లాల్ నెహ్రూ. 132 వ జయంతి వేడుకలను, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,అన్నపురెడ్డిపల్లి మండల ఇన్చార్జ్ వనమా గాంధీ ఆధ్వర్యంలో నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా గాంధీ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో కార్యకర్తలతో కలిసి తిరిగి, పార్టీ సభ్యత్వాలు నమోదుచేసి, పార్టీ బలోపేతానికి కృషి చేయడమే తన లక్ష్యమని అన్నారు. ముఖ్యంగా తనపై అపార నమ్మకం ఉంచి, కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల ఇన్చార్జిగా అవకాశం కల్పించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరియు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య, టిపిసిసి మెంబర్, ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి, తదితర నాయకులకు వనమా గాంధీ మరియు యువజన నాయకులు వనమా వెంకటేష్, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు దోసపాటి రాంబాబు,తిరునహరి పుల్లారావు, ఇనపనూరి జమలయ్య, వడ్డెపల్లి వెంకటేశ్వర్లు,పెంకే మల్లయ్య, ఇనుగంటి ప్రసాద్, చెరుకూరి ప్రసాద్, దావ రామయ్య, గోళ్ళ ముత్తయ్య, వీరబోయిన వెంకటేశ్వర్లు, మాయర కృష్ణ, మాయర శ్రీనివాస్, కల్లోజు నరసింహారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: