CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోరాటాల ఫలితమే రైతు చట్టాలు వెనక్కి-::సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా.

Share it:

 

 


 గుండాల/ ఆళ్ల పల్లి నవంబర్19(మన్యం మనుగడ) పోరాటాల ఫలితమే కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలను  వెనకకు తీసుకున్నదని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని ఈ ఘటన నిరూపించింది అన్నారు. రైతులకు నష్టం కలిగించే ఏదైనా సిపిఐ పార్టీ తరఫున వ్యతిరేకిస్తామన్నారు. మండల పరిధిలోనిముత్త పురం గ్రామానికి చెందిన 40 కుటుంబాలు సిపిఐ పార్టీలో చేరాలని ఆయన పేర్కొన్నారు. రైతు ఉద్యమాల్లో అసువులు బాసిన 670 మందికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య , ఆళ్ల పల్లి సర్పంచ్  కోటేశ్వరరావు, కో ఆప్షన్ సభ్యులు రహీం,  రేసు సురేందర్, కొమరం ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: