మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణం, అమ్మ సేవాసదనం వృద్ధాశ్రమంలో
భారత తొలి మహిళ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 104 వ పుట్టినరోజు పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. అదేవిధంగా స్థానిక అమ్మ సేవాసదనం వృధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకురాలు వగ్గేల పూజ మాట్లాడుతూ.... గుడిసెలో మగ్గే పేదవారికి పక్కఇళ్ళు , పెద్దల తొత్తుగా ఉండే బ్యాంకులను పేదల పరం చేయడమే కాకుండా, దేశ ఆర్ధిక వ్యవస్థనూ, రక్షణా వ్యవస్థనూ బలోపేతం చేయడంలో ఇందిరా గాంధీ చేసిన కార్యక్రమాలు ఆమోఘమని, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఘనత ఇందిరా గాంధీ దేనని తెలుయజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అనసూర్య, ఎంపీటీసీ వేముల భారతి, ప్రతాప్ లు .ఎంపీటీసీ సత్యవరపు తిరుమల, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: