తెలంగాణ వరి కొనే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించిన కేంద్రం
టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తెల్లం భాస్కర్
గుండాల నవంబర్ 19 (మన్యం మనుగడ) సీఎం కేసీఆర్ దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ వరి కొంటమని ప్రకటించిందని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనితోపాటు మూడు రైతు చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం ఆనందంగా ఉందన్నారు. రైతులకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి చట్టానికి టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. టిఆర్ఎస్ రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వమని ఆయన అన్నారు.
Post A Comment: